
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా (AA22) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇటీవలే, ఈ క్రేజీ ప్రాజెక్ట్లో దీపికా పదుకునే సైతం అడుగుపెట్టింది. యోధురాలిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి పలు క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ వారాంతరంలో AA22మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వనున్నాయని సమాచారం. ఇందులో భాగంగానే ఫస్ట్ షెడ్యూల్ను ముంబయిలో షూట్ చేయనున్నారట డైరెక్టర్ అట్లీ. అక్కడే మూడు నెలల పాటు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోనుందని సినీ వర్గాల టాక్. ఈ భారీ షెడ్యూల్ అల్లు అర్జున్ నటించిన సినిమాలలోకెల్లా ఇదే హైలెట్ అవ్వనుందని టాక్.
ఇందులో అల్లు అర్జున్తో యాక్షన్ సీన్స్ షూట్ చేసి.. వాటికి VFX వర్క్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అట్లీ టీమ్ మొత్తం అమెరికా వెళ్లనుందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
►ALSO READ | Chiranjeevi Mother: చిరంజీవి తల్లికి అనారోగ్యం: కేబినెట్ మీటింగ్ మధ్యలోనే హైదరాబాద్కు పవన్ కల్యాణ్
ఇప్పటికే, లాస్ ఏంజెల్స్లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్తో ఇంటారాక్ట్ అయినట్టు, అవతార్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక ఫస్ట్ షెడ్యూల్ ఫోటోజ్ని అంచనాలు మించి తీర్చిదిద్దే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ పాత్రకి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేయనున్నారని సినీ వర్గాల టాక్. ఈ అప్డేట్స్ ఐకాన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి.
Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir
— Sun Pictures (@sunpictures) April 8, 2025
Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥
🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM
ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.