‘ఆ పక్కా నాదే .. ఈ పక్కా నాదే .. తలపైన ఆకాశం ముక్కా నాదే.. నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే’ అంటున్నాడు పుష్పరాజ్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసిన టీమ్, నాలుగో పాటని నిన్న రిలీజ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్కి.. ‘సేతిలోన గొడ్డలట.. సేసిందే యుద్ధమట.. సేయందే సంధి అట’ అంటూ సింపుల్ లైన్స్తో బన్నీ క్యారెక్టర్ కళ్లకు కట్టేలా లిరిక్స్ రాశారు చంద్రబోస్. నకాష్ అజీజ్ పాడాడు. ‘ఎవడ్రా ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను.. మట్టిని నేను, నను తొక్కితే ఇటుకవుతాను.. రాయిని నేను, గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను’ లాంటి పదాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ్ రక్షిత్, గణేశ్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు బన్నీ. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ పేరుతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.
చేతిలోన గొడ్డలట.. చేసిందే యుద్ధమట
- టాకీస్
- November 20, 2021
మరిన్ని వార్తలు
-
Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
-
Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు
-
Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే
-
భోజ్పురి నటి ఆత్మహత్య.. వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్
లేటెస్ట్
- గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు : రేగుంట సునీల్
- రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
- కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా
- రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
- కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
- బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
- బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
- కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి
- మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
- ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..