కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా

కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా

ముంబై: బాధ్యతతో కూడిన సవాళ్లతో తాను అత్యుత్తమ క్రికెటర్‌గా రాటుదేలుతున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ టీమ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు. ‘కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా. ఓ క్రికెటర్ గా ఎప్పుడూ బాధ్యతతో ఉండాలనుకుంటా. సవాళ్లను ఎదుర్కోవడం వల్ల మనం మరింత గొప్పగా తయారవుతాం. గెలుపు, ఓటమి.. ఏది వచ్చినా తటస్థంగా స్వీకరించడం నేర్చుకున్నా. అదే మా టీమ్ నినాదం కూడా. విజయాలతో పాటు ఓటముల్ని కూడా మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అందువల్ల విజయాలకు మరింత విలువ పెరుగుతుంది. రషీద్ మా టీమ్‌కు ట్రంప్ కార్డ్. ఆపద సమయంలో అతడిని వాడుకుంటూ అందులోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా. రషీద్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉండటం వరం లాంటిది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడు టీమ్ ను కాపాడగలడు’ అని పాండ్యా పేర్కొన్నాడు.