దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భిన్నరూపాల్లో అలంకరించిన ఆదిపరాశక్తి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ మండపాన్నికరెన్సీ నోట్లతో అలంకరించారు. 5 వందలు, 100 నోట్లతో సహా యాభై, 200 రూపాయల నోట్లను వైశ్య సంఘం ఉత్సవ కమిటీ అమ్మవారి అలంకరణలో వినియోగించారు.
భక్తులు అమ్మవారికి సమర్పించిన నోట్లతో అలంకరణ చేసినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. కరెన్సీ నోట్ల అలంకరణకు రూ. 2కోట్ల 50 లక్షల వరకు వినియోగించినట్లు నిర్వాహకులు చెప్పారు. నోట్లతో అందంగా అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.