
హైదరాబాద్, వెలుగు: ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ ఇండియా తన ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రతి ఏటా నిర్వహించే భారీ సేల్ ఈవెంట్ ప్రైమ్ డే 2025ను వచ్చే నెల 12–14 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశంలో ప్రైమ్ డే మూడు రోజులు జరగడం ఇదే మొదటిసారి. ఈ 72 గంటల సేల్లో ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకమైన డీల్స్, కొత్త ఉత్పత్తుల లాంచ్లు, బ్యాంక్ ఆఫర్లు, వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, కిరాణా సామగ్రి, సౌందర్య ఉత్పత్తులు సహా అనేక కేటగిరీలపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయని అమెజాన్తెలిపింది. శామ్సంగ్, వన్ప్లస్, ఇంటెల్, ఐక్యూ, హెచ్పీ, లెనోవో వంటి 400కి పైగా ప్రముఖ బ్రాండ్ల నుంచి వేలకొలది కొత్త ఉత్పత్తులు లాంచ్అవుతాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డులతో కొంటే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ వీడియోలో 17 కొత్త సిరీస్లు సినిమాలు విడుదల కానున్నాయి.