
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. కుంటపై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావడంతో బుధవారం పనులను తిరిగి ప్రారంభించారు.
యుద్ధ ప్రాతిపదికన చెరువు పునరుద్ధరణ పనులు జరగాలని రంగనాథ్అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధితో పరిసరాలు ఆహ్లాదంగా మారుతాయన్నారు.