ఆసిఫాబాద్/కాగ జ్ నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను ఇన్టైమ్లో ఇవ్వాలని ఎలక్షన్అబ్జర్వర్దేవేందర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో, కాగ జ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ లో అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఖర్చు వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని చెప్పారు.
ప్రత్యేక బ్యాంక్ అకౌంట్, రికార్డుల ఫైలింగ్, ఖర్చు పరిమితులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్స్డెస్క్లలో సంప్రదించాలని సూచించారు. కాగజ్నగర్మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎలక్షన్మాస్టర్ ట్రైనర్ ఆసిఫ్ , నోడల్ ఆఫీసర్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.
