- మాజీ మంత్రి హరీశ్రావు
- క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా రోడ్షో
కోల్బెల్ట్, వెలుగు: కాంగ్రెస్పాలనలో సింగరేణి ఆగమాగమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన రోడ్షోకు ఆయన హాజరై మాట్లాడారు. అటానమస్సంస్థగా ఉన్న సింగరేణిలో గత ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదని, కోలిండియాకు ఆదర్శంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక స్కామ్లకు నిలయంగా మారిందని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి చెప్పినోళ్లకే ఓబీ టెండర్లు ప్లస్ 20కి ఇస్తూ సింగరేణికి నష్టం చేస్తున్నారన్నారు. ఒక్క నైనీ బ్లాక్ టెండరే కాదు.. సైట్విజట్సర్టిఫికెట్పై జరిగిన ఓబీ వర్క్స్, సోలార్పవర్ ప్లాంట్స్తదితర అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్హయాంలో నెలనెలా మెడికల్ బోర్డులు పెట్టి ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన రెండేండ్లలో కేవలం రెండుసార్లు మెడికల్ బోర్డులు పెట్టారన్నారు. పని చేయలేని కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ అవకాశం కల్పించడం లేదని తెలిపారు. అమలు చేయని పథకాల గురించి అడిగితే సీఎం డైవర్షన్పాలిటిక్స్చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు, కరెంట్బాధలు పోవాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ బాగుండాలంటే బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు
బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్పార్టీ మరోసారి మోసపూరిత హామీలు ఇస్తూ మున్సిపల్ఎన్నికల్లో గెలవాలని చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ప్రజలు నమ్మొద్దని కోరారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.బెల్లంపల్లి గడ్డమీద బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
