వీడియో షేర్​ చేసినోళ్ల అంతు చూస్తా.. తలసాని’ ఘటనపై లోకల్​ లీడర్ల తీరు దారుణం

వీడియో షేర్​ చేసినోళ్ల అంతు చూస్తా.. తలసాని’ ఘటనపై లోకల్​ లీడర్ల తీరు దారుణం

భైంసా, వెలుగు: ఇటీవల హైదరాబాద్​లో తనను మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​తోసేసిన వీడియోను సొంత పార్టీలోని స్థానిక నాయకులు సోషల్​మీడియాలో షేర్​చేస్తూ అవహేళన చేస్తున్నారని, వారి అంతు చూస్తానని బీఆర్ఎస్​ నేత, ఏఎంసీ చైర్మన్​ రాజేశ్​బాబు హెచ్చరించారు. సోమవారం బాసర నుంచి భైంసా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని తనపై దాడి చేస్తే  ముథోల్ బీఆర్ఎస్​లీడర్లు కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. పైగా ఆ వీడియోను సోషల్​మీడియాలో షేర్​చేయడం తనను మరింత ఆవేదనకు గురి చేసిందన్నారు. 

మంత్రి ఐకే రెడ్డి, ఐడీసీ చైర్మన్​ వేణుగోపాలా చారి, ఎమ్మెల్సీ దండే విఠల్​మంత్రి తలసానితో బహిరంగ క్షమాపణ చెప్పించారని, నియోజకవర్గ నాయకులు మాత్రం ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు బైక్​ర్యాలీతో బైంసాకు వచ్చిన రాజేశ్​బాబుకు బీఆర్​ఎస్​ లీడర్లు  సోలాంకి భీంరావు, సౌంవ్లీ రమేశ్​ఘన స్వాగతం పలికారు. వెంట తెలంగాణ ఉద్యమకారులు చిన్నారావు, మెండే శ్రీధర్, లక్ష్మణ్​ రావు, విజయ్​జాదవ్, రాజు పాల్గొన్నారు.