ఈ మందుతో 3 రోజుల్లో కరోనా పరారంట

ఈ మందుతో 3 రోజుల్లో కరోనా పరారంట

కోతులపై రెమ్డెసివిర్​ మందు సక్సెస్​.. అమెరికా ట్రయల్స్

వాషింగ్టన్​: రెమ్డెసివిర్​ మందు కరోనాపై బాగా పనిచేస్తున్నట్టు తేలింది. జస్ట్​ మూడు రోజుల్లోనే కరోనాను ఆ మందు చంపేసింది. దాని ఆనవాళ్లు లేకుండా చేసింది. మకాక్స్​ అనే జాతి కోతులపై చేసిన ప్రయోగాలు సక్సెస్​ అయ్యాయి. అమెరికాకు చెందిన నేషనల్​ ఇనిస్టిట్యూట్స్​ ఆఫ్​ హెల్త్​కు చెందిన సైంటిస్టులు మందును ప్రయోగించి ఈ నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే మనుషులపైనా ఆ మందును పరీక్షిస్తామని చెప్పారు. కోతులను రెండు బ్యాచ్​లుగా విడదీసి, కరోనా వైరస్​ను ఎక్కించారు. ఒక బ్యాచ్​లోని కోతులకు లంగ్స్​లో వైరస్​ సంఖ్య పెరిగిన 12 గంటల తర్వాత రెమ్డెసివిర్​ మందును ఇచ్చారు. ఆరు రోజుల పాటు రోజుకో డోసు చొప్పున ఆ మందును వేశారు.

ఇంకో బ్యాచ్​ (కంట్రోల్డ్​ గ్రూప్​) కోతులతో పోలిస్తే రెమ్డెసివిర్​ ఇచ్చిన కోతుల్లో వైరస్​ క్రమంగా తగ్గిపోయిందని గుర్తించారు. లంగ్స్​ డ్యామేజీ కూడా తగ్గిందని తేల్చారు. ఫస్ట్​ డోస్​ ఇచ్చిన 12 గంటల తర్వాత ఆ కోతుల్లో లోయర్​ రెస్పిరేటరీ ట్రాక్ట్​లో వైరల్​ లోడ్​ 100 రెట్లు తగ్గినట్టు గుర్తించారు. మూడు రోజుల్లో వైరస్​ పూర్తిగా నశించినట్టు నిర్ధారించారు. మనుషుల్లోనూ ఇవే రిజల్ట్స్​ వస్తాయని సైంటిస్టులు చెప్పారు. కరోనా సోకిన వెంటనే పేషెంట్లకు రెమ్డెసివిర్​ మందును ఇస్తే న్యుమోనియాతో పాటు కరోనాను తగ్గించొచ్చని తేలింది. ఇప్పటికే అమెరికాకు చెందిన గిలియడ్​ అనే ఫార్మా కంపెనీ ఆ మందును పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ మూడు కంపెనీలతో గిలియడ్​ ఒప్పందం చేసుకుంది.

సింగపూర్​ మందుపై క్లినికల్​ ట్రయల్స్​

సింగపూర్​ కంపెనీ మోనోక్లోనల్​ యాంటీబాడీని తయారు చేసింది. టీవై027 పేరుతో తయారు చేసిన ఆ మందును వచ్చే వారం నుంచే మనుషులపై ఫేజ్​1 క్లినికల్​ ట్రయల్స్​ చేయనుంది. ఈ మేరకు టీవై027ను అభివృద్ధి చేసిన తైచన్​ అనే సంస్థ బుధవారం ప్రకటన చేసింది. సింగపూర్​ హెల్త్​ సైన్సెస్​ అథారిటీ నుంచి హ్యూమన్​ ట్రయల్స్​కు అనుమతి వచ్చినట్టు చెప్పింది. తద్వారా కరోనా మందుపై ట్రయల్స్​ దశకు వచ్చిన మొదటి సింగపూర్​ కంపెనీ తైచన్​ నిలిచింది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా సంస్థలు మోనోక్లోనల్​ యాంటీబాడీలను తయారు చేసినా.. క్లినికల్​ ట్రయల్స్​ దశకు ఏవీ రాలేదని అక్కడి మీడియా ప్రకటించింది. ఇంటర్నేషనల్​ లెవెల్​లో క్లినికల్​ ట్రయల్స్​కు రిజిస్టర్​ చేసుకున్న మొదటి కంపెనీ తైచన్​ అని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!