టారిఫ్‌‌‌‌ల వేళ..యూఎన్ సెషన్‌‌‌‌కు మోదీ దూరం

టారిఫ్‌‌‌‌ల వేళ..యూఎన్ సెషన్‌‌‌‌కు మోదీ దూరం
  • టారిఫ్‌‌‌‌ల వేళ యూఎస్​లో నిర్వహించే మీటింగ్‌‌‌‌కు హాజరు కావొద్దని ​ నిర్ణయం!
  • ఈ నెల 9 నుంచి ప్రారంభం
  • 23–29 వరకు హైలెవల్​ జనరల్​ డిబేట్​

న్యూఢిల్లీ: టారిఫ్‌‌‌‌ల వేళ అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో..ఆ దేశంలో నిర్వహించే యునైటెడ్​ నేషన్స్​ జనరల్​ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు భారత సర్కారు​ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్​ హాజరు కానున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 9 నుంచి  యూఎన్​  జనరల్‌‌‌‌ అసెంబ్లీ 80వ సెషన్​​ ప్రారంభమవుతుంది. 

23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల హైలెవెల్​ జనరల్​ డిబేట్స్​ జరుగుతాయి. బ్రెజిల్‌‌‌‌ దేశాధినేత ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలవుతాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు​ డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌  ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈ నెల 27న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఉపన్యాసం ఉంటుందని యూఎన్ తన ​షెడ్యూల్‌‌‌‌లో పేర్కొంది. జులైలో విడుదల చేసిన తాత్కాలిక స్పీకర్స్​ జాబితా ప్రకారం,  సెప్టెంబర్ 26న జనరల్ డిబేట్‌‌‌‌లో మోదీ ప్రసంగించాల్సి ఉంది. 

అదేరోజు ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, సవరించిన జాబితాలో ప్రధాని మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ ​పేరును చేర్చారు. దీనిని బట్టి ఈ సెషన్స్​కు మోదీ హాజరు కావట్లేదని తెలుస్తోంది. ఇది తుది షెడ్యూల్ కానందున సమావేశాల ప్రారంభానికి ముందు మార్పులు జరిగే అవకాశం ఉంది.  బెటర్​ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌‌‌‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ (శాంతి, అభివృద్ధి, మానవ హక్కుల కోసం 80 ఏండ్లు, అంతకు మించి ఒక్కటిగా ఉండటం) అనే థీమ్‌‌‌‌తో నిర్వహిస్తున్నారు.