- సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు వినతి
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని కాలనీలు, నివాసాల మధ్య ఉన్న డంప్యార్డును తొలగించాలని అమీన్పూర్ పీపుల్స్అసోసియేషన్అధ్యక్షుడు ఆకుల తిరుమల్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కోరారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కమిషనర్ను అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డంప్యార్డు వల్ల చెడు వాసన వస్తుండడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
నేషనల్హైవే నుంచి అమీన్పూర్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరగా భూసేకరణ పూర్తైన వెంటనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్ చెప్పినట్లు తిరుమల్ రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువులో డ్రైనేజీ చేరుతుండడంతో చెరువు తన స్వభావాన్ని కోల్పోతున్నదని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కమిషనర్ను కోరారు. ఆయన వెంట కార్యదర్శి నరేశ్బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్చందర్ పాల్గొన్నారు.
