
కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో CISF అధికారులతో సమావేశం అవుతారు. ఆతర్వాత బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శంషాబాద్ లో ప్రారంభిస్తారు. పహడిషరీఫ్ లోని రంగనాయక తాండాలో ఓ గిరిజన కుటుంబానికి పార్టీ సభ్యత్వం ఇస్తారు. ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు మాట్లాడనున్నారు అమిత్ షా.
అక్కడి నుంచి సాయంత్రం నాలుగున్నరకు శంషాబాద్ లోని KLCC ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల 15 నిమిశాలకు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారు. నాలుగు ఎంపీలు గెలవడంతో ఉత్సాహంతో ఉన్న బిజెపి నేతలు… అమిత్ షా రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుందని చెప్తున్నారు.