తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నిన్న(సెప్టెంబర్ 16)న రాత్రి హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనను ముగించుకొని ఢిల్లీకి బయలుదేరారు. భారీ బందోబస్తు నడుమ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో అమిత్ షా హస్తినకు వెళ్లనున్నారు.
దీనికంటే ముందు నాలుగు గంటల పాటు శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ తో పాటు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ లతో అమిత్ షా భేటీ అయ్యారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు.