బిపర్జాయ్తుఫాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇదే విషయంపై ఢిల్లీలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 8 వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, భద్రత, వైమానిక దళ సిబ్బంది గుజరాత్ కి చేరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు.
జూన్ 15 నాటికి ఉత్తర గుజరాత్, పాకిస్థాన్ పై ఈ తుఫాన్ ప్రభావం భారీగా పడనుందని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే 8 గంటల్లో సూపర్ సైక్లోన్ గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 16 వరకు గుజరాత్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.