అమిత్ షా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అమిత్ షా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆర్టిజన్ కార్మికుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులను బానిసలుగా చూస్తోందన్న ఆయన.. రిటైర్డ్ ఎంప్లాయిస్ ను సీఎండీలుగా పెట్టుకుని ఆటలాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పవర్ సంస్థల నష్టాలకు కారణం సీఎం కేసీఆరేనని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చుండేది కాదన్ ఆయన.. నిరుద్యోగులుఒకే రోజు నాలుగు ఎగ్జామ్స్ ఎలా రాస్తారని నిలదీశారు.

కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా... మైనార్టీ రిజర్వేషన్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కనీస అవగాహన లేకుండా ఓ కేంద్రమంత్రి హోదాలో ఉండి రిజర్వేషన్లపై ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. అమిత్ షా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.