ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

ధరలు పెంచిన మోదీ  ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌‌‌‌లో, సూర్యాపేట కలెక్టరేట్ వద్ద సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.