అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారయ్యింది. అమిత్ షా మార్చి 12 న తెలంగాణ పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బిజేపీ నేతలు తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక  పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో స్టేట్ బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరుగుతాయి. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.