ముంబై: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం బాలీవుడు స్టార్ అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. ముంబై నుంచి 700 మంది వలస కూలీలను యూపీలోని వారి సొంతూళ్లకు పంపించేందుకు నాలుగు విమానాలు ఏర్పాటు చేశారు. రైలు బుక్ చేయాలనుకున్నప్పటికీ అధికారికంగా అనుమతులు రాకపోవడంతో ఫ్లైట్స్ బుక్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. బుధవారం రెండు విమానాలు 180 మంది చొప్పున కార్మికులతో యూపీలోని గోరఖ్ పూర్, వారణాసి, అలహాబాద్ కు చేరుకోగా.. గురువారం మరో రెండు విమానాలు బయల్దేరుతాయని తెలిపాయి. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 300 మంది వలస కార్మికులను వారివారి ఇళ్లకు చేర్చారు. ఆయన సాయంపై కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ఎంతో మంది వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బాటలోనే అమితాబ్ కూడా కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు సాయం చేయడం విశేషం.
బిగ్ బీ సాయం.. వలస కూలీల కోసం 4 విమానాలు ఏర్పాటు
- దేశం
- June 11, 2020
లేటెస్ట్
- వొడాఫోన్ ఐడియా ఎఫ్పీఓకి రిటైల్ ఇన్వెస్టర్లు దూరం
- ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్ కోచింగ్
- అన్ని వ్యాపారాలు అదరగొట్టాయ్
- 30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు
- అల్లరి నరేష్.. ఆ ఒక్కటీ అడక్కు వచ్చేస్తోంది
- ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం
- దేశంలో బీజీపీకి అనుకూల వాతావరణం : కిషన్ రెడ్డి
- రాహిల్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు వాయిదా
- హైలైట్గా.. విశ్వంభర ఇంటర్వెల్ ఫైట్
- 30 వారాల ప్రెగ్నెన్సీ.. అబార్షన్కు సుప్రీం ఓకే
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- ఖమ్మం జిల్లాలో..గాలివాన బీభత్సం
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్