ముంచుకొస్తున్న అంఫాన్ తుపాను ముప్పు

ముంచుకొస్తున్న అంఫాన్ తుపాను ముప్పు

అంఫాన్‌ తుపాన్‌ పశ్బిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇవాళ(గురువారం) బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు తీర ప్రాంత జిల్లాల్ని అతలాకుతలం చేస్తున్నాయి . అటు బెంగాల్‌ కూడా వాతావరణం మారింది. అక్కడ కూడా వర్షాలు మొదలయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మందిని తీర ప్రాంత జిల్లాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తుపాను బెంగాల్ వైపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు. ఈదురు గాలులు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

తుపాను కారణంగా కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాల్ని గురువారం సాయంత్రం 5గంటల వరకు రద్దు చేశారు.