
- చంపేస్తామంటూ ఆడియో క్లిప్ పంపిన దుండగులు
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ ఎంపీ నవనీత్ రాణాను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు మెసేజ్ పంపించారు. ఎంపీ మొబైల్కు ఆడియో క్లిప్ పంపిన దుండగులు.. ఎంపీతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్పై అభ్యంతరకర పదాలు ఉపయోగించారు.
ఈ నెల 3న ఆమె ఫోన్కు బెదిరింపులు రాగా.. ఆమె పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుగుతోందని చెప్పారు.