లండన్ : బ్రిటన్లోని ఓ మేజర్ హైవేపై ప్రమాదం జరిగింది. కారు, ఇంధన ట్యాంకర్ ఢీకొన్నాయి. థేమ్స్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్పై ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. న్యూ లండన్, గ్రోటన్ మధ్య ఉన్న థేమ్స్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. ఫ్యూయల్ ట్యాంకును కారు ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి.
దట్టమైన పొగ కూడా కమ్ముకుంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే బ్రిడ్జ్ ను మూసివేశారు అధికారులు.