శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఏప్రిల్ 4న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఫైలెట్ చాకచక్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేయడంతో అందర ఊపిరి పీల్చుకున్నారు.