పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం

పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం
  • ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన 

మెహిదీపట్నం, వెలుగు : పాత కక్షలతో ఓ వ్యక్తిపై కొందరు హత్యకు యత్నించిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి కుటుంబసభ్యులు, ఎస్ఐ జావెద్ తెలిపిన ప్రకారం.. ఆసిఫ్‌‌నగర్ లోని జేబాబాగ్‌‌లో ముక్రంజా మసీద్​వద్ద నివసించే మహమ్మద్ రఫిక్ (46) ఆటో డ్రైవర్. మంగళవారం సాయంత్రం  రఫిక్ వద్దకు వచ్చి ఆరుగురు వ్యక్తులు కట్టెతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రఫిక్ ను వెంటనే బంజారాహిల్స్​లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 

ప్రస్తుతం అతని కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే.. కొన్నేళ్లుగా వరుసకు సోదరులైన షౌకత్, అజీజ్, వసీమ్, రియాజ్, రెహ్మన్, షానుతో  రఫిక్​కు విబేధాలు ఉండేవని చెప్పారు.