ఐరన్ పరిశ్రమలో పేలుడు..ముగ్గురికి తీవ్రగాయాలు

ఐరన్ పరిశ్రమలో పేలుడు..ముగ్గురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి: షాద్నగర్ పరిధిలోని కొందుర్గులోని ఐరన్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రం శివారులో స్కాన్ ఐరన్ పరిశ్రమలో ఐరన్ లోడ్ అన్ లోడింగ్ చేస్తుండగా బట్టిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు  తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.