చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో గల్లంతైన వృద్ధుడు.. గ్రామంలో విషాదం

చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో గల్లంతైన వృద్ధుడు.. గ్రామంలో విషాదం

వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వృద్ధుడు గల్లంతైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగింది. భోదాపురం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల బండయ్య(70) అనే వ్యక్తి.. గ్రామం సమీపంలోని పెదవాగులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలం ( చేపలు పట్టే పరికరం) వాగులో తట్టుకుంది. దీంతో ప్రవహిస్తున్న వాగులోకి బండయ్య దిగాడు. వాగు వేగంగా ప్రవహించడంతో ఒక్కసారిగా అదుపుతప్పి వాగులో మునిగి గల్లంతయ్యాడు. బండయ్యకు భార్య బాలమ్మ, ఐదుగురు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సీతారాంపురం గ్రామస్తులు వాగు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 

https://www.youtube.com/watch?v=mYFcNfwymGs