- నలుగురి నుంచి రూ. 2.30 లక్షలు వసూలు
- నిందితురాలిని రిమాండ్కు పంపిన పోలీసులు
మాదాపూర్, వెలుగు: డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని ఓ మహిళ పలువురి నుంచి డబ్బులు తీసుకుని చీటింగ్కు పాల్పడిన ఘటన మాదాపూర్పోలీస్స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్తెలిపిన ప్రకారం.. బోరబండ సైట్3కి చెందిన గోకం సూరి మాదాపూర్శిల్పారామంలో టికెట్కౌంటర్లో పని చేస్తున్నాడు. చార్మినార్సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన జ్యోతి (46)తో సూరికి పరిచయం ఉంది. కొద్ది రోజుల కిందట ఆమె శిల్పారామం చూసేందుకు వచ్చిన సమయంలో డబుల్ ఇండ్లు కావాలంటే ఇప్పిస్తానని, తనకు కలెక్టర్ఆఫీస్లో తెలిసిన వాళ్లు ఉన్నారని సూరికి చెప్పింది.
ఆమె మాటలు నమ్మిన అతడు మొదట రూ. 50 వేలు ఇచ్చాడు. అదేవిధంగా సూరి అన్న రూ. 30 వేలు, వదిన రూ. 50 వేలు, చెల్లెలు రూ.50 వేలు, అత్త రూ.50 వేల చొప్పున జ్యోతికి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత సూరి ఇండ్లపై ఆమెను అడగగా సమాధానం దాట వేస్తూ వచ్చింది. శుక్రవారం శిల్పారామం వచ్చిన జ్యోతిని మరోసారి సూరి నిలదీశాడు. దీంతో సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి మాదాపూర్పోలీసులకు కంప్లైంట్ చేయగా జ్యోతిపై చీటింగ్ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.