మొరాయించిన 108 .. గాయపడ్డ వ్యక్తి మృతి

మొరాయించిన 108 .. గాయపడ్డ వ్యక్తి మృతి

జూలూరుపాడు, వెలుగు : బైక్, ఆటో ఢీకొనడంతో గాయపడ్డ వ్యక్తిని 108లో దవాఖానాకు తీసుకువెళ్తుండగా అది మొరాయించింది. దీంతో ట్రీట్​మెంట్​అందడంలో ఆలస్యమై ఆ వ్యక్తి చనిపోయాడు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవుకు చెందిన గూగులోత్​ఈరియా (58) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద బైక్ పై వెళ్తుండగా  ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానాకు 108లో తరలిస్తుండగా 4 కిలోమీటర్లు వెళ్లగానే మధ్యలో ఆగిపోయింది.  మరో 108 వెహికల్​ రావడానికి గంట టైం పట్టింది. అప్పటికే  లేట్​కావడంతో దవాఖానాకు తీసుకెళ్లేసరికి అతడి పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటలకు చనిపోయాడు.