- కాంగ్రెస్ అధికార ప్రతినిధి చంటి డిమాండ్
బోథ్, వెలుగు: నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గాని అడుగుపెట్టనీయొద్దని కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బోథ్ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్ చేశారు. సోమవారం బోథ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొట్టే కొబ్బరికాయలు, చేసే రిబ్బన్ కటింగ్లకు నిధులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్చేశారు. సమావేశంలో కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.
