- రెండు గంటలపాటు రాస్తారోకో
- అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
ఖానాపూర్, వెలుగు: గతేడాది యాసంగి సీజన్ సన్నధ్యానం బోనస్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ రైతులు ఆందోళన చేశారు. సోమవారం పట్టణ శివారులోని కుమ్రం భీం చౌరస్తా వద్ద బాసర, మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన సన్న వడ్ల బోనస్ను జమ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
సన్న వడ్ల బోనస్ కోసం ఎన్నో సార్లు వ్యవసాయ శాఖ అధికారులకు కలిసినా ఎలాంటి స్పందన లేదన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుజాత రెడ్డి అక్కడకు వచ్చి రైతులతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సన్న వడ్ల బోనస్ త్వరలోనే రైతుల ఖాతాలో వేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు ఇబ్బం దులు పడ్డారు.
