మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 30న నగరంలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆవరణలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మైత్రి ప్రియ తెలిపారు.
ప్రైవేట్ సంస్థల్లో 200 ఖాళీలున్నాయని, 18 నుంచి 30 ఏండ్ల వయసు కలిగిన ఆసక్తి కలిగిన నిరుద్యోగులు టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. జాబ్ను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు 9948568830 నంబర్ లో సంప్రదించాలని కోరారు
