అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య

అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య

రాష్ట్రంలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రఘనాథ్ పూర్ లో ఆడే దేవీదాస్ అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. దేవీదాస్ కు ఐదుగురు కుమార్తెలుండగా.. ఇద్దరికి వివాహం చేశాడు. మరో ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాల్సి ఉంది. ఆయనకు రెండు ఎకరాల భూమి ఉండగా.. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత కొంతకాలంగా పంటలు పండక... అప్పుల భారం పెరిగిందని  కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి కుప్పకూలిపోయాడు. ఇది ఆలస్యంగా గమనించిన అతని కుమార్తె.. స్థానికుల సాయంతో దేవీదాస్ ను దవాఖానకు తరలించారు. అప్పటికే రైతు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దేవీదాస్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.

మరిన్ని వార్తల కోసం..

ఈ ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ప్రియాంక క్లారిటీ

కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత