ఈ ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

ఈ ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలకు దిగుతున్న వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల.. మరోసారి కామెంట్స్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. సిద్ధిపేటలో పత్తి రైతు బీరయ్య, నల్గొండలో వరి కౌలు రైతు కట్టెబోయిన లింగయ్య, ఆదిలాబాద్ లో వరి రైతు ఆడే దేవిదాస్, భద్రాద్రి కొత్తగూడెంలో రైతు భూక్యా బాలాజీ, జనగామలో పుచ్చ రైతు తేజావత్ లచ్చిరాంల సూసైడ్ విషయాన్ని గుర్తు చేశారు. కోటీశ్వరులను చేసి రైతులపై దొరగారు చూపిన ప్రేమకు ఒకేరోజు ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ ట్వీట్ కు ‘ఐదుగురు రైతుల ఆత్మహత్య’ పేరుతో వీ6 వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథానాన్ని జోడించారు. 

మరిన్ని వార్తల కోసం:

మనసులు గెలిచిన శివకార్తికేయన్

వారం మొత్తం పడిన కష్టం మరచిపోవాలంటే..