పాక్‌లో తెరుచుకోనున్న హిందూ ఆలయం

పాక్‌లో తెరుచుకోనున్న హిందూ ఆలయం

పాకిస్తాన్ సియాల్‌ కోట్‌లో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ ఆలయాన్ని మళ్లీ తెరుస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారత్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసిస్తూ 1992లో కొంత మంది ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో హిందువులు ఇక్కడికి రావడం మానేశారు.  72 ఏళ్ల క్రితం మూసివేసిన ఈ ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొచ్చింది. సర్దార్ తేజా సింగ్ నిర్మించిన షావాలా తేజా సింగ్ ఆలయం భారత్, పాక్ విభజన సమయంలో మూతపడింది. తాజాగా పాకిస్తాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా దర్శించుకోవచ్చని డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ చెప్పారు. ఈ ఆలయ పునరుద్ధణ, పరిరక్షణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు పాక్ ప్రభుత్వం తెలిపింది.