హైదరాబాద్ సిటీలో ఆంధ్ర ఓట్ బ్యాంక్ టర్న్.. బీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం

హైదరాబాద్ సిటీలో ఆంధ్ర ఓట్ బ్యాంక్ టర్న్.. బీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆంధ్రా ఓట్​ బ్యాంక్​అంతా ఒకప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వైపే ఉండేది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రా ఓట్​బ్యాంక్ క్రమంగా బీఆర్ఎస్​ నుంచి పక్కకు పోతున్నదని చెబుతున్నారు. ఆ ఓట్లు కాంగ్రెస్ ​వైపు మళ్లాయని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పట్టు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.

బీఆర్ఎస్ ​నేతల్లో నైరాశ్యం.. 

జూబ్లీహిల్స్ ​బైపోల్‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ క్యాడర్ మొదటి నుంచీ అనుకున్నది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచే గెలుపు తమదే అన్న ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నెల14 తర్వాత తెలంగాణలో రాజకీయ తుఫాన్​రాబోతున్నదని, 500 రోజుల్లో బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తుందంటూ ప్రకటనలు చేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్​ అభ్యర్థి సునీతకు సానుభూతి ఓట్లు పడతాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఓటమి ఎదురుకావడంతో బీఆర్ఎస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు.