రైలు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మోడీ

రైలు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మోడీ

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ట్వీట్‌ చేశారు. “ మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం కారణంగా కూలీలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో దీనిపై మాట్లాడాను. పరిస్థితిని పరిశీలిస్తున్నాం. అన్ని విధాలుగా సాయం అందిస్తాం” అని మోడీ ట్వీట్‌ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు దాటుతున్న వలస కూలీలను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు చనిపోయారు.