అనిల్ అంబానీ కంపెనీకి.. ఎంఎంఆర్డీఏ రూ. 560 కోట్ల అవార్డు

అనిల్ అంబానీ కంపెనీకి.. ఎంఎంఆర్డీఏ రూ. 560 కోట్ల అవార్డు

హైదరాబాద్​, వెలుగు: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్​డీఏ)  అనిల్ అంబానీకి చెందిన ముంబై మెట్రో వన్​ ప్రాజెక్ట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్​)కు అవార్డు మొత్తంలో 50శాతం అయిన రూ. 560.21 కోట్లను జమ చేసింది.   ఎంఎంఓపీఎల్​ ముంబైలో మెట్రో రైల్ సేవలను నిర్వహిస్తోంది.   

ముంబైలో మెట్రో ప్రాజెక్టులపై రెండు సంస్థల మధ్య దీర్ఘకాలంగా వివాదాలు నడుస్తున్నాయి.  ప్రాజెక్ట్ వ్యయం రూ. 2,356 కోట్ల నుంచి రూ. 4,321 కోట్లకు పెరిగిందని ఎంఎంఓపీఎల్ పేర్కొనగా, ఎంఎంఆర్​డీఏ దీనిని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంఎంఆర్​డీయే అవార్డు మొత్తంలో 50శాతం చెల్లించింది. ఈ డబ్బును మెట్రో ఇన్​ఫ్రా కోసం వాడతారు.