
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతిని ఆదివారం అతడి సోదరుడు మహిత్ నారాయణ్ ఘనంగా నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తర్వాత బయట పేషెంట్ బంధువులకు అన్నదానం నిర్వహించారు. మహిత్ నారాయణ్మాట్లాడుతూ చక్రి జయంతి, వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
చక్రి స్వగ్రామమైన మహబూబాబాద్లో కూడా రక్తదాన శిబిరం నిర్వహించినట్టు చెప్పారు. తర్వాత శ్రీనగర్కాలనీలోని ఎవరెస్ట్ స్టూడియోలో చక్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో సినీ హీరో సాయిరాం శంకర్, పలువురు గాయనీగాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. చక్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.