చక్రి జయంతి సందర్భంగా అన్నదానం.. బసవతారకం హాస్పిటల్లో పండ్ల పంపిణీ

చక్రి జయంతి సందర్భంగా అన్నదానం.. బసవతారకం హాస్పిటల్లో పండ్ల పంపిణీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతిని ఆదివారం అతడి సోదరుడు మహిత్ నారాయణ్  ఘనంగా నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు  పండ్లు పంపిణీ చేశారు. తర్వాత బయట పేషెంట్ ​బంధువులకు అన్నదానం నిర్వహించారు. మహిత్ నారాయణ్​మాట్లాడుతూ చక్రి జయంతి, వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.

చక్రి స్వగ్రామమైన మహబూబాబాద్లో కూడా రక్తదాన శిబిరం నిర్వహించినట్టు చెప్పారు. తర్వాత శ్రీనగర్​కాలనీలోని ఎవరెస్ట్​ స్టూడియోలో చక్రి జయంతి వేడుకలు  నిర్వహించారు. ఇందులో సినీ హీరో సాయిరాం శంకర్, పలువురు గాయనీగాయకులు పాల్గొని కేక్​ కట్​ చేశారు. చక్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.