
గండిపేట, వెలుగు : నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్గా నాగపూర్ణ, వైస్చైర్మన్గా విజయ్బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్నెగ్గింది.
ఇక్కడ మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉండగా, 14 మంది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో కొత్త చైర్పర్సన్గా నాగపూర్ణను, వైస్ చైర్మన్గా విజయ్బాబును ఎన్నకున్నారు. అనంతరం నాగపూర్ణ మాట్లాడుతూ ప్రతివార్డును అభివృద్ధి చేస్తానని చెప్పారు. కౌన్సిలర్లను కలుపుకునిపోతానన్నారు.