హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. తాజాగా ఇవాళ ఎట్ రిస్క్ దేశాల నుండి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 10 మందికి ఒమిక్రాన్ సోకింది.
కెన్యా దేశం నుంచి వచ్చిన ఆరుగురికి, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి, దుబాయ్ (యూఏఈ) నుంచి వచ్చిన ఇద్దరికి, ఘనా నుంచి వచ్చిన ఒకరికి, టాంజానియాల నుంచి వచ్చిన మరొకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. మరో ముగ్గురి శాంపిల్స్ జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
17 సార్లు జైలుకెళ్లి వచ్చినా.. భార్యతో కలిసి మళ్లీ చోరీలు
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత