
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్నాయక్ సాయితేజతో పాటు వివేక్ కుమార్ భౌతికకాయాన్ని కూడా గుర్తించినట్లు భారత సైన్యం తెలిపింది. వారి పార్థివదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించింది. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీరితో మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను సైతం గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని భారత సైన్యం వెల్లడించింది.