అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్ లో చదవుతున్న  భారతీయ విద్యార్థి గద్దె ఉమా సత్య సాయి అనే విద్యార్థి  మృతి చెందాడని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ తెలిపింది.  మృతికి గల కారణాలపై దర్యాప్తు  జరగుతోందని   తెలిపారు. అయితే ఉమా సత్యసాయి భారత్ లోని ఏ ప్రాంతానికి చెందిన వాడు అనేది వెల్లడించలేదు.

ఉమా సత్య సాయి మృతి పట్ల భారత కాన్సులేట్  తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేసింది.   ఉమా గద్దె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలిస్తాం అని వెల్లడించింది.  2024 నుంచి యూఎస్ లో  భారతీయ లేదా భారత సంతతికి చెందిన విద్యార్థులు దాదాపు  10 మంది మరణించారు.

రెండు రోజుల క్రితమే అమెరికాలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే యువకుడు మిస్సయ్యాడు.