కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు విరుష్క జంట సిద్దమైంది. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానుండగా..ఈ వేడుకలను జరుపుకునేందుకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట దుబాయ్లో వాలింది. కోహ్లీ తమ కూతురు వామికను ఎత్తుకోగా...అనుష్క కోహ్లీ పక్కనే నిల్చుంది. వీరిద్దరు సూర్యుడిని తదేకంగా చూస్తూ నిల్చుండిపోయారు.
దుబాయ్ అంటే విరుష్క జంటకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఈ కొత్త సంవత్సరం వేడుకలను అక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న జంట...అక్కడ సూర్యోదయం సమయంలో దిగిన ఫొటోను కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. 2022లో ఇదే ఆఖరి సూర్యోదయం అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్గా మారింది.