కొన్ని జంటల్ని స్క్రీన్పై చూస్తే కన్నుల పండువలా ఉంటుంది. అలాంటి హిట్ పెయిర్స్లో ప్రభాస్, అనుష్క కూడా ఉన్నారు. ఆల్రెడీ బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ జోడీ. అయితే ఆ తర్వాత ఈ జంటను మరోసారి వెండితెరపై చూసే చాన్స్ దొరకలేదు ఆడియెన్స్కి. కానీ త్వరలోనే అది జరగబోతోందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ లిస్టులో ఇటీవలే డైరెక్టర్ మారుతి కూడా చేరాడు. ఆయన డైరెక్షన్లో ఓ ఫన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. త్వరలోనే సెట్స్కి వెళ్లనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. ఆల్రెడీ శ్రీలీల, మాళవిక మోహనన్లను ఫిక్స్ చేసిన మారుతి.. ఇప్పుడు అనుష్కను లాక్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి మొన్నటివరకు మోహ్రీన్ పేరు వినిపించింది. కానీ సూపర్ హిట్ జోడీగా ప్రభాస్, అనుష్కలకు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకుగాను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట మారుతి. కేవలం రెండు షెడ్యూల్స్లోనే మూవీని పూర్తి చేయాలనుకుంటున్నారట. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ మూవీలో కూడా నటి స్తోంది అనుష్క.