
వికారాబాద్, వెలుగు: నూతన మద్యం పాలసీలో వైన్స్షాపులకు ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, వారికి ఎన్ని షాపులు వచ్చినా లైసెన్స్ జారీ చేస్తామని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి విజయభాస్కర్ గౌడ్ ప్రకటించారు. బుధవారం ఆయన తన చాంబర్లో మాట్లాడారు.
వికారాబాద్ జిల్లాలో 59 మద్యం షాపులకు గానూ గత నెల 26 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 6 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏదైనా వైన్స్షాపునకు తగినన్ని దరఖాస్తులను రాకుంటే, ఆ షాపు డ్రా విషయం కమిషనర్ నిర్ణయానికి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్రెడ్డి, వికారాబాద్ ఎస్ఐ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.