- యాక్సిడెంట్స్ నివారణపై దృష్టి పెట్టాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో మంగళవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ముక్కోటికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్ యాక్సిటెంట్ల నివారణకు పక్కాగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. నిత్యం వాహనాలను తనిఖీ చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్లాన్ చేసుకోవాలన్నారు.
కోడి పందేలు, బెట్టింగులతో పాటు అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్సిపెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఐటీ సెల్ సీఐ రాము పాల్గొన్నారు.
