ఏపీ  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

 ఏపీ  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 - 23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేబినెట్ సమావేశంలో సాధారణ బడ్జెట్ తోపాటు వ్యవసాయ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. శాసనమండలి లో సాధారణ బడ్జెట్ ను మంత్రి అప్పలరాజు ప్రవేశ పెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ మంత్రి వేణుగోపాల్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేటాయింపుల వివరాలను ఏయే రంగాలకు ఏయే దృష్టితో ప్రాధాన్యత కల్పించింది మంత్రి బుగ్గన వివరించారు. బడ్జెట్ కు ముందు సోషియో ఎకనామిక్ సర్వేను సీఎం జగన్ విడుదల చేశారు.
నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ పార్టీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసన నినాదాలు చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

 

ఇవి కూాడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్