15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్

15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్

రాష్ట్ర వ్యాప్తంగా 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. టూరిజం,యూత్, శిల్పారామంపై  జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మినిస్టర్ అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు…బొట్లు అనుమతి ఫిట్ నెస్ చూశాక అనుమతి ఇస్తామన్నరు.  నదిలో బోట్ రవాణాపై త్వరలో కమిటీ, నివేదిక  వస్తుందన్నారు. కోటి రూపాయలతో శిల్పారామాల మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.