మోడీ సర్.. ఏపీకి మీ ఆశీస్సులు కావాలి : సీఎం జగన్

మోడీ సర్.. ఏపీకి మీ ఆశీస్సులు కావాలి : సీఎం జగన్

ఏపీ అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సాయం చేయాలని జగన్ కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీతో తమకున్న అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని ఉండబోదని జగన్ తేల్చి చెప్పారు. 

రాష్ట్రాభివృద్ధి, శ్రేయస్సు కోసం విభజన హామీలతో పాటు.. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అవసరమని ఎల్లవేళలా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సీఎం.. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.