‘కూ’ యాప్ లో చేరిన ఏపీ సీఎం జగన్

‘కూ’ యాప్ లో చేరిన ఏపీ సీఎం జగన్
  •  అధికారిక అకౌంట్లు ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీఎంఓ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ‘‘కూ’’ (Koo ) లో చేరారు. ప్రజలను నేరుగా వారి మాతృభాషల్లో చేరుకోవాలనే ఉద్దేశ్యంతో కూలో చేరినట్లు సీఎంవో ప్రకటించింది. ఇది యూజర్లకు (Users) వారి మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్ చేరడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPOfficial), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ (@AndhraPradeshCM) మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (@APDigitalCorp) వారి అధికారిక అకౌంట్లను భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ లో ప్రారంభించారు. @Ysjagan హ్యాండిల్‌ ని ఉపయోగించి జగన్ మోహన్ రెడ్డి  ప్రజలతో తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో సంభాషిస్తారు. వారి Koo (కూ) ప్రొఫైల్ నుండి ఇటీవల పోస్ట్‌ లో ఒక వీడియో షేర్ చేయబడింది. అందులో వారు తరతరాలుగా ఉండే స్థిరమైన ఆసుపత్రులను నిర్మించాల్సిన అవసరాన్ని తెలియజేసారు. యూజర్లు (Users) వారితో https://www.kooapp.com/profile/ysjagan లో కనెక్ట్ అవ్వచ్చు.
ఈ సందర్భంగా Koo (కూ) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని స్వాగతిస్తూ, Koo (కూ) యాప్ లో వారి ఉనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వారందరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపారు. Koo (కూ) బాగా పాపులర్ అయినందున రాష్ట్రం నుండి ఇంకా చాలా మంది ప్రముఖులు, తత్వవేత్తలు, ప్రాంతీయ పార్టీలు ఈ యాప్ లో చేరాలని భావిస్తున్నాయన్నారు. ప్రజలు తెలుగుతో పాటు Koo (కూ) అందించే ఇతర భాషలలోని వ్యక్తులతో సంభాషించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సీనియర్ సినిమా తనికెళ్ల భరణి, సీనియర్ నటి విజయశాంతి,నటుడు, రచయిత ఎల్‌బి శ్రీ రామ్, హీరోయిన్లు ఈషా రెబ్బా, అనుష్క శెట్టి నటుడు నాగ శౌర్య కూడా Koo (కూ) లో చేరారు.